ఏపీ మద్యం స్కాం కేసులో కీలక పరిణామం.. ముప్పిడి అవినాశ్ రెడ్డిని విచారిస్తున్న సిట్

  • కేసులో ఏ-7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి
  • విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్న అధికారులు
  • మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న విచారణ

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోవడంతో విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అవినాశ్ రెడ్డిని కోర్టు అనుమతితో విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి, ప్రత్యేక బృందాలు విచారణ ప్రారంభించాయి.


మద్యం ముడుపుల వ్యవహారంలో షెల్ కంపెనీల ద్వారా జరిగిన భారీ నగదు లావాదేవీల వెనుక అవినాశ్ రెడ్డి హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈయన ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌ కెసిరెడ్డికి (ఏ1) సమీప బంధువు కావడంతో, అక్రమ సొమ్మును వివిధ మార్గాల్లో మళ్లించే బాధ్యతలను ఈయనే చూసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా షెల్ కంపెనీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి, అక్రమంగా వచ్చిన డబ్బును చట్టబద్ధమైన ఆదాయంగా చూపించే ప్రయత్నం చేశారనే ఆరోపణలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఈ కస్టడీ విచారణ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది.


Muppidi Avinash Reddy
AP Liquor Scam
Andhra Pradesh Liquor Case
Raj Kesireddy
SIT Investigation
Shell Companies
Money Laundering
Guntur Jail
Vijayawada

More Telugu News